మేడ్చల్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో చోరీ

by Disha Web Desk |
మేడ్చల్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలోని మూడుచింతపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మద్యం దుకాణం వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు గాల్లోకికాల్పులు జరిగి హల్‌చల్ చేశారు. దాదాపు మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ చేసి నానా బీభత్సం చేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి మద్యం దుకాణంలో రూ.2 లక్షలు చోరీ చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దుండగుల కోసం గాలిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed